సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా వరద నీటి విడుదల
సంగారెడ్డి, సెప్టెంబర్ 05 (డైలీ రిపోర్ట్):
సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల , ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో వస్తున్నది. నేడు అనగా సెప్టెంబర్ 5 న ఉదయం 09:00 గంటల తరువాత ఎప్పుడైనా ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరద నీటిని విడుదల జరుగుతోంది. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలరు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువులు, గొర్ల కాపరులు మరియు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని నీటిపారుదల శాఖ సింగూర్ ప్రాజెక్టు,
సంగారెడ్డి జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post Views: 12