సంగారెడ్డి , సెప్టెంబర్ 09(డైలీ రిపోర్ట్):
రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి పట్టణంలో కురిసిన భారీ వర్షాల వల్ల రెవిన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీ లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి తో కలిసి పర్యటించారు. లోతట్టు ప్రాంతాలలో వరద నీటితో మునిగిన ఇండ్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. వరద బాధితులతో మంత్రి మాట్లాడి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీలోకి మూడు అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందన్నారు.అధిక వర్షాల వల్ల కాలనీలోని దాదాపు 130 ఇళ్లల్లోకి నీరు చేరిందన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైన్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు. ఎర్రకుంట చెరువు నుంచి అవుట్ ఫ్లో తగ్గిపోయిందన్నారు.
కాలనీవాసులు అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.ఇరిగేషన్, మున్సిపాలిటీ శాఖలు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.ఎర్రగుంట, చంద్రయ్య కుంటల నీటి ప్రవాహాన్ని దిగువకు వెళ్లకుండా కొంతమంది ఇల్లు కట్టుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయనీ వెల్లడించారు.చెరువుల ట్రైన్ లతో పాటు పెద్ద తూములు కూడా ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ కాలనీలోకి 3 అడుగుల ఎత్తు వరకు నీరు చేరిందని పేర్కొన్నారు.అధిక వర్షాల వల్ల కాలనీలోని దాదాపు 130 ఇళ్లల్లోకి నీరు చేరిందనీ ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.చంద్రయ్య కుంటకు ఓపెన్ డ్రైన్ కావాలి.. ఏర్పాటు చేస్తామన్నారు.ఎర్రకుంట చెరువు నుంచి అవుట్ ఫ్లోర్ తగ్గిపోయిందన్నారు .
కాలనీవాసులు అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు .ఎర్రగుంట, చంద్రయ్య కుంటల నీటి ప్రవాహాన్ని దిగువకు వెళ్లకుండా కొంతమంది ఇల్లు కట్టుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి వెల్లడించారు.చెరువుల డ్రైన్ లు , పెద్ద తూములను ఏర్పాటు చేసి వరద సమస్యను త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.