• జహీరాబాద్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో నిషేదిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.
• 140 కిలోల ఎండు గంజాయి, ఇద్దరు వ్యక్తులు,మహీంద్ర బొలేరో మ్యాక్స్ పికప్ వాహనం మరియు రెండు సెల్ ఫోన్ లు నాలుగ్ సిమ్ కార్డ్స్ సీజ్.
సంగారెడ్డి డైలీ రిపోర్ట్ ప్రతినిధి, సెప్టెంబర్ 10:
సంగారెడ్డి జిల్లాలో భారీ మొత్తంలో నిషేధిత గంజాయి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ వివరాలు వెల్లడించరు. చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం మేరకు నిన్న సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిరాగ్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి, తన సిబ్బంది మరియు సిసియస్ సిబ్బందితో కలిసి చిరాగ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఆనంద్ ధాబా ముందు ఎన్హెచ్-65 రోడ్ పై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అట్టి వాహనం ట్రాలి పై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉన్నది, అట్టి వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల ఇద్దరు వ్యక్తులను కిందకు దించి, వివరాలు తెలుసుకొనగా ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపినారు. అట్టి బోలెరో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలీ క్రింది భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని క్రింద 140 కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరుకోవడం జరిగింది.
నేర ప్రవృత్తి: కర్ణాటక రాష్ట్రం, బాల్కి కి చెందిన మల్లు గొండ అనే నేర ప్రవృత్తి గల వ్యక్తి నిషేదిత ఎండు గంజాయి ఓడిశా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఎండు గంజాయి సేకరించి అట్టి గంజాయి ని బాల్కి కి చెందిన లఖన్, సిద్దిరామ్, సునిల్, కిరణ్ మరియు మల్లేశ్ నాయక్ ల ద్వారా ఎవరికి తెలియకుండా కార్లలో బోలెరో వాహనాలలో తీసుకువచ్చి మల్లుగొండకు అప్పగించగ అతను అట్టి గంజాయి ని మహారాష్ట్ర లో ని ముంబై, పుణె లాతూర్ వివిద పెద్ద సిటిలలో ఎక్కువ దరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నారు.
నిందితుల వివరాలు:
1) లఖన్ తండ్రి జనార్ధన్, వయసు: 29 సం.లు, కులం, మరాఠ, వృత్తి డ్రైవరు, గ్రామము శంషాపూర్ వాడి, బల్కి తాలూకా, బీదర్ జిల్లా కర్నాటక రాష్ట్రం.
2) సిద్దిరామ్ తండ్రి జగన్నాథ్ వయసు 28 సం.లు, కులం యాదవ్, వృత్తి లేబర్, గ్రామము బసవేశ్వర్ చౌక్ బీర్ దేవ్ గల్లీ బాల్కి, బీదర్ జిల్లా కర్నాటక రాష్ట్రం.
మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునిల్ మల్లెశ నాయక్ లు పరారీ లో ఉన్నారు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగాత వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరుగుతుంది అన్నారు.
ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డ్ లు ప్రకటించారు.ఈ ప్రెస్ మీట్ నందు జహీరాబాద్ డియస్పి కే. రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ యస్. శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ ఇన్స్పెక్టర్, S-Nab ఇన్స్పెక్టర్ రమేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, చిరగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మాణిక్ రెడ్డి, ఏఎస్ఐ, సిసిఎస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.