రాయికోడ్ , సెప్టెంబర్ 14,(డైలీ రిపోర్ట్);
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో జంబ్గి (కె) గ్రామంలో భూంగొండేశ్వరః స్వామి కమిటీ హాల్ వద్ద గణేష్ లడ్డూ వేలం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఏడు రోజులుగా పూజలు అందుకుని వినాయకుడి ప్రసాదం ఒగ్గు రవి కూతురు ప్రాణవి తాత చిన్న మాణిక్యన్న 41 వేయిలు రూపాయల కు స్వంతం చేసుకున్నారు.. గ్రామస్థుల ఆహ్వానం మేరకు గ్రామాన్నీ ఆదర్శ గ్రామము గా తీర్చిదిద్ధి రూపురేఖలు మార్చిన నాయకుడు శ్రీకాంత్ లడ్డును దక్కించుకున్న ఒగ్గు రవి ని గ్రామస్థుల ముందు అభినందించారు.
వినాయక చవితి సమయంలో గ్రామంలో ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజలు అందుకున్న ఈ లడ్డూని దక్కించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఇందుకోసం వేలంలో ఎన్ని వెయిలైన లక్షలైన సమర్పించుకునేందుకు భక్తులు వెనకాడరు. ఈ లడ్డూ దక్కించుకునేవారికి ఆ వినాయకుడి కరుణ కటాక్షాలు ఏడాదంతా ఉంటాయని బలంగా నమ్ముతారు. ఈ లడ్డూని దక్కించుకున్న వారు.. ప్రతి సారి వ్యవసాయ పొలంలో లడ్డు ప్రసాదాన్నీ చల్లడం వల్ల పంటలు బాగా పండుతాయనే విషయం అందరికి తెలిసిందే.. కానీ ఈ సారి లడ్డును దక్కించుకున్న ఒగ్గు రవి కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ ఉన్న ప్రజల అందరికి లడ్డు ప్రసాదాన్ని పంచిపెట్టారు. అనంతరం వినాయకుడి శోభాయాత్రను భజన తో ఆటపాటలతో ప్రారంభించి గ్రామ పురవిదులగుండా ఆటపాటలతో శోభాయాత్ర ను నిర్వహించి స్థానిక చెరువు వద్ద నిమార్జనం చేశారు. వినాయకుడి వేలం లడ్డును అందుకున్న దృశ్యంలో వెంకన్న, అనిల్ రెడ్డి,వెంకటి,రమేష్,సంగారెడ్డి, వగ్గు శ్రీనివాస్, కావనం అశోక్, భక్తులు గ్రామస్థులు తదితరులు ఉన్నారు..