సంగారెడ్డి సెప్టెంబర్ 18(డైలీ రిపోర్ట్):
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయం వద్ద వినాయకుడి లడ్డూ వేలం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 11 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు ప్రసాదం వేలంలో రాయికోడ్ కు చెందిన నడిమీదొడ్డి రాజు, చెర్ల రాయిపల్లి కి చెందిన సల్లవుద్దీన్ ఇద్దరు స్నేహితులు కలిసి 77 వేయిలు777 రూపాయల కు స్వంతం చేసుకున్నారు. స్నేహితుల పిలుపు మేరకు అక్కడికి చేరుకున్న నాయకుడు బలమ్మోల్ల తుకారం కు బహుమానంగా ఇచ్చారు. రాయికోడ్ మండల కేంద్రంలో అందరితో కలుపుగోలుగా ఉంటున్న నాయకుడు తుకారం స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం అన్న పదం నా స్నేహితులకు అంకితం అని వారిని గ్రామస్థుల ముందు అభినందించారు.
రాయికోడ్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయం వద్ద వినాయక చవితి నుండి వినాయకుడి నిమార్జనం ప్రతి రోజు ఉదయం సాయంత్రం పూజలు అందుకున్న ఈ లడ్డూని దక్కించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు. ఇందుకోసం వేలంలో ఎన్ని వేయిలు అయిన లక్షలైన సమర్పించుకునేందుకు భక్తులు వెనకాడరు. ఈ లడ్డూ దక్కించుకునేవారికి ఆ వినాయకుడి కరుణ కటాక్షాలు ఏడాదంతా ఉంటాయని బలంగా నమ్ముతారు. ఈ లడ్డూని దక్కించుకున్న వారు.. ప్రతి సారి వ్యవసాయ పొలంలో లడ్డు ప్రసాదాన్నీ చల్లడం వల్ల పంటలు బాగా పండుతాయనే విషయం అందరికి తెలిసిందే.. కానీ ఈ సారి లడ్డును దక్కించుకున్న నడిమీదొడ్డి రాజు, సల్లవుద్దీన్ మాత్రం నాయకుడు తుకారం కు బహుకరించి వేలం వద్ద ఉన్న ప్రజల అందరికి లడ్డు ప్రసాదాన్ని పంచిపెట్టారు. అనంతరం వినాయకుడి శోభాయాత్రను భజన తో ఆటపాటలతో ప్రారంభించి గ్రామ పురవిదులగుండా ఆటపాటలతో శోభాయాత్ర ను నిర్వహించి మంజీర బ్యాక్ వాటర్ సిరూర్ నిమార్జనం చేశారు. వినాయకుడి వేలం లడ్డును అందుకున్న దృశ్యంలో పార్టీలకు అతీతంగా నాయకులు చేవెళ్ల విట్ఠల్, రాజు గౌడ్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు గ్రామస్థులు, తదితరులు ఉన్నారు..