లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచం
సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి
కంసాని మయూరి
(కందుకూరు పట్టణ టిడిపి తెలుగు మహిళల ఆర్గనైజింగ్ సెక్రటరీ)
కందుకూరు బ్యూరో,సెప్టెంబర్ 20(డైలీ రిపోర్ట్)
భక్తులు తిరుమల లడ్డు అంటే ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఇప్పుడిదీ చాలా వివదాస్పదంగా మారింది. శ్రీవారికి మనదేశంలోనేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు.ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డులో ఉపయోగించే పదార్థాలలో.. జంతువుల కళేబరాలు ,కొవ్వు వాడడం అనేది చిన్న తప్పు కాదని దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి
.దీనిపై చాలా మంది భక్తులు తీవ్ర మనోవేదనకు లోనౌతున్నరు అని కందుకూరు పట్టణ టిడిపి తెలుగు మహిళ ఆర్గనైజర్ సెక్రెటరీ కంసాని మయూరి అన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొవాలని కంసాని మయూరి డిమాండ్ చేశారు.
Post Views: 17