రేగుంట గ్రామానికి చెందిన చందనగిరి రాజేష్ (38) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరగా విషయాన్ని తెలుసుకున్న రేగుంట గ్రామస్తులు విరాళాలు అందించి ప్రాణాలు కాపాడటానికి తమవంతు సహాయాన్ని అందించి మానవత్వనికి ప్రతీకగా నిలిచారు.రాజేష్ భార్య కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ తో మృతి చెందింది రాజేష్ కు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తుల సహాయంతో 1,03,001 అక్షరాల ఒక్క లక్ష మూడు వేల రూపాయలు నగదును గురువారం బాధిత కుటుంబానికి అందచేశారు.గ్రామంలో ఆర్థికంగా వెనకబడిన నిరుపేద కుటుంబాలకు ఇలాగే రేగుంట గ్రామస్తులం అందరం కలిసి కట్టుగా అండగా నిలుస్తామని తెలుగు వెలుగు సాహితీ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గనవేని మల్లేష్ యాదవ్, కారోబార్ తిప్పన వేని సుధాకర్ అన్నారు.ఆపద సమయంలో ఆర్థికంగా చేయూతను అందించిన రేగుంట గ్రామస్తులకు బాధితుడు రాజేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుందేళ్ల రాజేష్,రంపేకోత రాజేందర్,గెల్లె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
