మల్యాల మే 13 : జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు 29వ గిరిప్రదక్షిణ సోమవారం ఘనంగా జరిగింది చిలుకూరి బాలాజీ దేవస్థానం అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సురేష్ ఆత్మరాo మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారని, దాదాపు 5000 మంది గిరి ప్రదక్షిణ లో పాల్గొన్నారనీ, శుభ ఫలితాలు కలుగుతాయని అన్నారు. దాదాపు 6 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా భక్తులు, హనుమాన్ స్వాములు వెళ్లి అనంతరం అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ గిరీ ప్రదక్షిణ కార్యక్రమంలో కొడిమ్యాల,మల్యాల మండలంలోని హనుమాన్ స్వాములు, భక్తులు, జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన హనుమాన్ స్వాములు, భక్తులు, మహిళలు, యువకులు, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 14