గంగాధర, జూన్ 04 : గంగాధర మండలంలోని న్యాల కొండన్న పల్లి గ్రామంలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీరయ్య పట్నాలు, కల్యాణోత్సవం కార్యక్రమానికి బుధవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ శ్రీ బీరప్ప కామరాతి స్వామి అమ్మవార్ల ఆశ్శీసులు అందరి పై ఉండి, శుభం జరుగలని కోరారు.కల్యాణ మహోత్సవాలకి ఆహ్వానం పలికిన గొల్ల కురుమ ఆలయ కమిటీ సోదరులందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఇక్కడ అయన వెంట బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, కొండగట్టు ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ ఉప్పుల గంగయ్య, మాజీ సర్పంచ్ లు కంకణాల విజేందర్ రెడ్డి, రామిడి సురేందర్ రెడ్డి, నాయకులు గంగరాజు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
Post Views: 7