ప్రతి ఒక్క పౌరుడు పర్యావరణాన్ని రక్షించుకోవాలి.గంగాధర ఎంపీడీవో ధమ్మని రాము.

గంగాధర, జూన్ 05 : పర్యావరణాన్ని రక్షించుకొనుటకు ప్రతి ఒక్కరూ వృక్ష సంపదను కాపాడుకోవాలని గంగాధర ఎంపీడీవో ధమ్మని రాము పేర్కొన్నారు. బుధవారం గ్రామపంచాయతీ మధురానగర్ జూనియర్ కాలేజ్ రోడ్డులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దమ్మని రాము మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు ప్రతి ఒక్క పౌరుడు పర్యావరణాన్ని రక్షించుకోవాలని మన బావి తరాల కొరకు అంతరించిపోతున్న వృక్ష సంపదను కాపాడుటకుగాను ప్రతి ఒక్కరూ వృక్షాలను రక్షించుకోవాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీఓ గౌరీ రమేష్, పంచాయతీ కార్యదర్శి అనిల్, ఏపీవో సత్య ప్రకాష్, టి ఏ లు సునీల్, ప్రశాంత్, చంద్రమౌళి, వివిధ గ్రామాల కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు