ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ముఖ్యమంత్రి సహయ నిది చెక్కులను పంపిణి చేసిన ప్రభుత్వ విప్.

రుద్రంగి, జూన్ 9 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు గొప్ప వరమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన 20 మంది లబ్ధదారులకు 11 లక్షల 20 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడిక‌ల్ హ‌బ్‌గా మారిందన్నారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్ర‌గ‌తి, ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తిదాయ‌కంగా మారిందని రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచి ప్ర‌జా ఆరోగ్య భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వానికున్న చిత్త‌శుద్ధిని చాటుకున్నారని తెలిపారు.

మన ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వార, ఎల్ఓసి ల ద్వారా ఇప్పటి వరకు 20 కొట్లు పై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 సంవత్సరాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వ ఏర్పడిన నాటినుండి నేటి వరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి,ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం గంగనర్సయ్య, స్థానిక తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నాగరాజు, మండల వ్యవసాయ అధికారిని ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారిని జ్యోతి, మాజీ సర్పంచ్, తర్రే ప్రభలత మనోహర్, లబ్ధిదారులు, రుద్రంగి కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు