కోరుట్ల జూన్,09 : ప్రాథమిక పాఠశాల యస్ ఆర్ యస్ పి క్యాంప్ గడి కల్లూరు రోడ్ కోరుట్ల నందు బడి బాట కార్యక్రమం ఇంటింటికీ తిరుగుతూ సోమవారం విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోనే సుశిక్షితులైన,నాణ్యమైన చదువు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారని,ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు,ఉచిత నోట్ బుక్స్, మధ్యాహ్నం భోజనం,వారానికి మూడు కోడి గుడ్లు,రాగి జావ ఇస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, వార్డ్ మాజీ కౌన్సిలర్ సంగ లింగం ఉపాధ్యాయులు పూర్ణ చందర్,సురేందర్,ధనలక్ష్మి, సుమలత అంగన్వాడి టీచర్స్ హిమగిరి,లక్ష్మి,పద్మ, రాజామని,ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 5