గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేర్చాలి…

బుగ్గారం జూన్ 12: గడప గడపకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి గడప గడప కు బీజెపిని చేర్చేందుకు మనందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని బుగ్గారం మండల బీజెపి పార్టీ అధ్యక్షులు మేడవేణి శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం బుగ్గారం మండల కేంద్రంలో బీజేపీ కార్యవర్గ సమావేశం జరుగగా ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ రాజేష్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో శ్రీధర్ మాట్లాడుతూ 11ఏండ్ల నరేంద్ర మోడీ పాలనలో వికసిత్ భారత్ లాగా దేశం పరుగులు పెడుతోందాన్నారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి లో గతంలో 11 వ స్థానం లో ఉన్న భారత్ ను నేడు నరేంద్ర మోడీ నాలుగవ స్థానం లో నిలిపాదన్నారు. ఎన్నో దేశ పటిష్ట నిర్ణయాలతో మిగతా ప్రపంచ దేశాలే నివ్వేర్రబోయే పరిస్థితులు నెలకొన్నయ న్నారు. భారత శత్రు దేశమైన పాకిస్తాన్ కు ఇటీవలే సిందూర్ తో చుక్కలు చూపించిన ఘనత నరేంద్ర మోడీదని కొనియాడారు. ఈ కార్యక్రమం లో బుగ్గారం మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాస్, దొనకొండ అనిల్, బిజెపి మండల ఉపాధ్యక్షులు కేతి రవీందర్ రెడ్డి, బండారి సత్తన్న, కార్యదర్శి నరేష్, సునీల్, కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు కందునూరు లచ్చయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు చీపిరిశెట్టి మధుకర్, భూత్ అధ్యక్షులు వడకాపురం సతీష్, చెట్ల సునీల్, పంచిత మల్లేష్, గడ్డం మహేష్, గోలి లింగారెడ్డి, సంపత్ రావు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు