కమలాపూర్ 19 : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని గురువారం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలలోని విద్యార్థులకు అందిస్తున్న పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ పాల్గొని, విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం హరిజనవాడలోని అంగన్వాడీ సెంటర్లో ప్రభుత్వ అందిస్తున్న దుస్తులను బాలబాలికలకు పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ మల్లిక్, కాంగ్రెస్ నాయకులు విష్ణు దాసు వంశీధర్ రావు, శనిగరపు రమేష్, అంగన్వాడి టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 2