కోడిమ్యాల సెప్టెంబరు 30 నవ వెలుగు :
జగిత్యాల లో జరిగిన జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డి పోటీలలో కొడిమ్యాల ప్రథమ స్థానం నిలిచింది. హోరా హోరీ గా సాగిన మ్యాచ్ లో రాయికల్ జట్టు పై గెలుపొందింది.శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లలో విజేత కొడిమ్యాల కబడ్డీ జట్టు కు జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ షీల్డ్ లను అందజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి లక్ష్మీరాంనాయక్, కొడిమ్యాల మండల ఎస్ జి ఎఫ్ ఛైర్మెన్ రాజ మల్లయ్య, తిర్మలాపూర్ సోషల్ ఉపాద్యాయులు ఏనుగు ఆదిరెడ్డి , పిడి లు బీరయ్య, అనూప్ రెడ్డీ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 18