చలో కలెక్టరేట్ కు పిలుపు.

మల్యాల అక్టోబర్ 1 నవ వెలుగు :

అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడికి తరలి రావాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని ముత్యంపేట,తాటిపల్లి,మల్యాల రెడ్డి సంఘలు మరియు మల్యాల పెరిక సంఘం,మానాల రైతుల సమావేశంలో జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రైతులతో మాట్లాడుతూ ఏలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ, ఎకరాకి 15000 రైతు భరోసా,అలాగే వరికి క్వింటాల్ కి 500 బోనస్ ప్రకటించాలని కోరుతూ చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి,నేరెళ్ల భూమారెడ్డి సాగర్ రావు,మల్లయ్య, రవీందర్ రెడ్డి,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు