ఉప్పల్ బాలికల ఉన్నత పాఠశాలలో సైకిళ్ళ పంపిణీ..

కమలాపూర్ అక్టోబర్ 1 నవ వెలుగు :

హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలోని మంగళవారం ఉప్పల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు .ఇట్టి సైకిళ్ల దాతగా ఎర్రబెల్లి లక్ష్మీ లింగారావు దంపతులు ప్రతిరోజు ఉప్పులపల్లె గ్రామం నుండి పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సౌకర్యానార్థం దాదాపుగా 51 వేల రూపాయల విలువ చేసే సైకిళ్ళను 9 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. తన కొడుకు అమెరికాలో స్థిరపడిన తమ కుమారులు ఎర్రబెల్లి విట్టల్ రావు, విజయ్ మన్మోహన్రావు వారి ఆర్థిక సహాయంతో సైకిళ్లను వితరణ చేసి వారి సామాజిక సేవా భవాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి రామకృష్ణన్ రాజ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వి.వాణి, ఏఏ పిసి చైర్ పర్సన్ శ్రీమతి బండారి రాధా, సంపత్ రావు, శ్రీధర్ రావు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రమాదేవి, రేవతి, సంపత్ కుమార్, నయీమ్ పాషా, రామకృష్ణయ్య, షర్మిల, రాజేందర్, శ్రీదరా చారి, కొమురయ్య, ఇందిరా రాణి, కిరణ్ ,పాపయ్య, కోమాల మరియు శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు